గుండాల జూలై 10(మన్యం మనుగడ) గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో మండలంలోని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఉదయం ఎంపీడీవో హజరత్ వలితో కలిసి మల్లన్న వాగు, కిన్నెరసాని, ఏడు మెలికల వాగు, వెంకటాపురం గ్రామ సమీపంలోని కిన్నెరసాని వాగులను సందర్శించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని ఆయన సూచించారు. వాగుల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు.
Navigation
Post A Comment: