మన్యం మనుగడ కరకగూడెం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజుకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అయినా ఆస్పత్రిలోని రికార్డులను మందులను పరిశీలించారు.ఆస్పత్రిలోని సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నరా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య సిబ్బందితో అన్నారు.ఆశా దినోత్సవం సందర్భంగా ఆశావర్కర్లు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వారికి కొన్ని సూచనలు చెప్పారు.ఈ సమావేశంలో వైద్యాధికారి పర్షియా నాయక్,సి హెచ్ ఓ కాంతమ్మ, హెచ్ ఓ దుర్గారావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: