గుండాల జూలై 11(మన్యం మనుగడ) గుండాల పోలీసులని శభాష్ అంటున్న స్థానిక ప్రజలు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు ఎటువంటి ప్రమాదం జరగకుండా గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ సిబ్బందితో కలిసి వాగుల వద్ద ఉంటూ ప్రహార కాస్తున్నారు ప్రజలకు వాగులు దాటకుండా తగు సూచనలు చేస్తున్నారు. సోమవారం మండలం పరిధిలోని మోదుగుల గూడెం గ్రామం వద్ద కిన్నెరసాని వాగును దాటేందుకు వచ్చిన ప్రజలను తన సిబ్బందితో కలిసి వాగు దాటించి పలువురు మన్నలను పొందుతున్నారు. వర్షంలో సైతం ప్రజలకు సేవలు అందిస్తున్న ఎస్సై రాజశేఖర్ సిబ్బంది స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.
Post A Comment: