మన్యం మనుగడ వాజేడు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ నుండి అతిభారీ వర్షాలకు గంటకు 30 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుంది. చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతమైన తెలంగాణ రాష్ట్ర శివారు ప్రాంతం వాజేడు మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది.చత్తీస్గడ్ సరిహద్దు తెలంగాణ రాష్ట్రంలో టేకులగూడెం అనే గ్రామం రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో అంతరాష్ట్ర సంబంధాలు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.రెండు, మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాలకు వాజేడు మండలంలోని టేకులగూడెం, కృష్ణాపురం, పేరూరు ,గొల్లగూడెం, చీకుపల్లి ,వీరాపురం, గుమ్మడి దొడ్డి, వాజేడు, పూసూరు ,జడ్చర్లపల్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న మూడు రోజుల లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హైదరాబాద్ వారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని వాజేడు తహసీల్దార్ గూడూరి లక్ష్మణ్, రెవిన్యూ సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుపతి రావు,పిఎస్ సిబ్బంది. స్థానిక సర్పంచ్ లు స్థానిక సెక్రెటరీలు సహాయక చర్యలు చేపట్టారు. వరద ముంచెత్తిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సీజనను వ్యాధులు వ్యాప్తి చెందకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని పేరూరు, పి హెచ్ సి డాక్టర్, నంబి కిషోర్,వాజేడు పి హెచ్ సి డాక్టర్ , మంకిడి వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు వైద్య క్యాంపులు నిర్వహిస్తామని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
Post A Comment: