దమ్మపేట జులై 02 ( మన్యం మనుగడ ) : శనివారం నాడు దమ్మపేటలోని టి.యస్.టి.డబ్లు రెసిడెన్సీయల్ కళాశాల పాఠశాల ను మండల ఆదివాసీ జేఏసీ బృందం సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా అశ్వారావుపేట,దమ్మపేట, ములకలపల్లి,చండ్రుగొండ,మండలాల్లో ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్నారు.వీరు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు కానీ,వీరి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాను అభ్యసించలేకపోవుచున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగనున్న కౌన్సెలింగ్ లో ఆదివాసీ విద్యార్థులకు 80% సీట్లు కేటాయించి ఆదివాసీ విద్యార్థుల అభివృద్ధికై కృషి చేయాలని ప్రిన్సిపాల్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ,తాటి పోతురాజు,పర్శిక మారేశ్, సోయం రామ్మూర్తి, వాసం వెంకటేశ్వరరావు, మడకం ప్రసాద్, వాడే వీరాస్వామి, వంకా వరాలబాబు, ప్రశాంత్, కుంజా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: