మన్యం టీవీ భుర్గంపాడు:
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ మండలం సారపాక, నాగినేనిప్రోలు,రెడ్డి పాలెం, బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపికైనా మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ, పాఠశాలలో మౌళిక సదుపాయాల కల్పించడం, నాణ్యమైన విద్యను ఆడించడమే లక్ష్యం అని ఆమె తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమం పథకాలు అమలవుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్,పీఏసీఎస్ చైర్మన్,స్థానిక సర్పంచులు, స్థానిక ఉపసర్పంచులు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు,స్థానిక టిఆర్ఎస్ యువజన నాయకులు,స్థానిక సొసైటీ డైరెక్టర్లు,స్థానిక వార్డుసభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,స్థానిక పంచాయితీ సెక్రటరీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: