మన్యం మనగడ ప్రతినిధి, బూర్గంపహాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండల పరిధిలోని గౌతమిపురం కాలనీలో నివాసం ఉంటున్న బర్ల వేణు చందు ఇటీవల కాలంలో, పాల్వంచ లో కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకొనుచున్న తరునం లో తీవ్రంగా కరెంట్ షాక్ గురై ఖమ్మంలోనే,ఆరోగ్య ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బూర్గంపాడు మండలం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1985 -86 పదవ తరగతి బ్యాచ్ కి సంబంధించిన, మిత్ర బృందం వేణు చందు పరిస్థితి తెలుసుకొని చలించిపోయి, తమ వంతు సహాయంగా 20000 ఆర్థిక సాయం అందించారు. అతి తొందరలోనే వేణు చందు కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకున్నారు.సహాయ దాతలు, బాదం రామలింగారెడ్డి , ముత్యాల రామకృష్ణ, బెల్లంకొండ వెంకట సత్యనారాయణ, మారం సుబ్బారెడ్డి, నరేంద్ర చారి, వీరాoరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ వి రెడ్డి, బి వెంకటేశ్వర రెడ్డి, దౌపాటి వెంకయ్య చౌదరి సహాయం చేయగా, ఈ కార్యక్రమంలో గోనెల నాని,బర్ల ముత్యం, కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: