మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఇంటర్ ప్రథమ సంవత్సరంలో కస్తూర్భాగాంధీ బాలికల వసతి గృహంలో ప్రవేశాల కోసం పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి శాంతకుమారి కోరారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.... కేజీబీవీ లో ఇంటర్ ప్రథమ సంవత్సరనికి సిఈసి, ఎం పి హెచ్ డబ్ల్యు (నర్సింగ్ )గ్రూపులో చేరడానికి ఈ నెల 4 నుండి 8 తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు, పదవ తరగతి టి సి, మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు,స్టడీ సర్టిఫికెట్స్, పాస్ ఫోటోలు రెండు జతచేసి కేజీబీవీ వసతిగృహంలో అందజేయాలన్నారు.
Post A Comment: