గుండాల జూలై 2(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గడపగడపకి వైయస్సార్ టిపి కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గాడి పల్లి కవిత పేర్కొన్నారు. శనివారం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ టిపి ప్రభంజనం సృష్టించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే గడప గడపకు వైయస్సార్ టిపి కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు తడిశెట్టి రాంబాబు, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు సుధాకర్, శ్రీధర్, భారత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: