గుండాల జూలై 2(మన్యం అమనుగడ) విద్యుత్ పనులు చేయించే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే విద్యుత్ కార్మికుడైన ఇల్లందు పట్టణానికి చెందిన జర్పుల వినోద్ తో పనులు చేయిస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు వినోద్ కు తీవ్ర గాయాలు కావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. విద్యుత్ సరఫరా నిలపకుండా నిర్లక్ష్యంగా పనులు చేయించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Navigation
Post A Comment: