గుండాల జూలై 2(మన్యం మనుగడ) ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శి డి.వికృష్ణ సంతాప సభ పోస్టర్ను ప్రజా పంధా సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డి.వి కృష్ణ అనారోగ్య కారణంతో జూన్ 26న మరణించారని ఆయన కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. డి.వి.కె మరణం భారతదేశ విప్లవోద్యమానికి తీరనిలోటని అన్నారు. కార్మికులు, పేదలు శ్రమ దోపిడికి గురవుతున్న తరుణంలో వారి తరఫున ముందుండి పోరాటాలు చేశారన్నారు. జూలై 17వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంతాప సభలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొమరం శాంతయ్య, పుష్పరాజు, కోడూరి జగన్, పునేం మంగయ్య, రాజు మాచర్ల కోటి, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: