CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

Share it:

 


దమ్మపేట జులై 21 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం.ఏ.ఐ.కే.యస్. ఆధ్వర్యంలో దమ్మపేట తాసిల్దారుకి రైతు సమస్యలపై మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి పండురి వీరబాబు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఒక సేత్తో రైతుబంధు ఇస్తూ ఇంకొక చేత్తో ఎరువులు పై పురుగు ముందులపై విత్తనాలపై అధిక రేట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వాలకి సిగ్గుండాలని రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు అతిగతి లేదని రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రైతుల్ని రాజులను చేస్తామని ఈరోజున రైతులని బిచ్చగాళ్ళని చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు ఉచితంగా ఎరువులు పురుగుమందులు పంట పెట్టుబడి ఇవ్వాలని అన్ని రకాల పంటలకు పంట బీమా కల్పించాలని కౌలు రైతులకు రైతుబంధు రైతు బీమా వర్తింపచేయాలని తక్షణం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయాలని వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా రైతులకు పంట పెట్టుబడి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో బేజవాడ రాము,జనిబేగం,శాంతి,ప్రసాద్,శ్రీను,కృష్ణవేణి,గాజుల శ్రీను,నక్కనాగమణి,జాన్ బి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: