మంగపేట మండల కేంద్రం లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈడి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం సందర్బంగా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను మంగపేట పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ జాతీయ నాయకులు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా ఈ డి వేధింపులకు గురిచేస్తున్న సందర్బంగా ఈ డి కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది, ఈ సందర్బంగా పోలీస్ లు నిర్భందించడం జరిగింది అక్రమ అరెస్ట్ లతో ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నారని ఇది ప్రజా స్వామ్యనికే విఘాతం అని తెలిపారు. ప్రజాస్వామ్యం లో ప్రతి పౌరుడికి శాంతి యుతంగా తమ నిరసన తెలిపే హక్కు ఉందని తెలియజేశారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి సోమన్న, మండల అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి,ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దబత్తుల జగదీష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిడైతులా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న నాయకులు మైబూబ్ ఖాన్ భూర్గుల సతీష్ తోట అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: