మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని మారేడు బాక వద్ద అతివేగంతో మోటార్ సైకిల్ ని నడుపుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మండలానికి చెందిన రాజేష్ అనే యువకులు తన స్నేహితులైన అఖిల్ కారం నవీన్ లతో కలిసి మోటార్ సైకిల్ టీఎస్ 04 ee 6913 అనే వాహనంపై మండలంలోని పాత మరెడుబాకా వైపు వెళుతూ సరిగ్గా రాత్రి 10:30 సమయంలో మారేడుబాక గ్రామ శివారులో బైకును అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక నేరుగా వెళ్లి బీటీ రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెల్లడంతో బైక్ నడిపిన నవీన్ కి వెనకాల ఉన్న అఖిల్ కు తీవ్ర గాయాలు కాగా రాజేష్ మాత్రం అక్కడికక్కడే తలకు బలమైన గాయం అవ్వడంతో మృతి చెందాడు మిగిలిన ఇద్దరు వైద్యం నిమిత్తం ఆసుపత్రి లో చికిత్స చెప్పందుతున్నారూ. కేవలం నవీన్ అతివేగం గా అజాగ్రత్తగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగి రాజేష్ చనిపోయాడని మృతుని తాత అయినటువంటి తెల్లం ధర్మయ్య ఫిర్యాదు మేరకు దుమ్ముగూడెం ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు చిన్నతనాన్ని చనిపోవడంతో రాజేష్ తాత వద్దనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
Post A Comment: