మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక అన్నారు. మంగళవారం దామరచర్ల పంచాయతీలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని రోగులను పరీక్షించి మందులను అందజేశారు. గ్రామస్థులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్ ఇర్ప లక్ష్మీపతి, పంచాయతీ కార్యదర్శి శంకర్, వైద్య సిబ్బంది పుల్లమ్మ, సుశీల, భవాని,ఆశవర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: