మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరదలకు నష్టపోయిన బాయ్ తో కుటుంబాలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్టు ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు మండల పరిధిలోని రేగుబెల్లి, కన్నాపురం, దుమ్ముగూడెం, బైరాగులపాడు, గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీ, ఆంధ్రకే శ్రీనగర్, ఎల్ ఎన్ రావు పేట, పర్ణశాల, సీతానగరం గ్రామాల్లో 1000 కుటుంబాలకు నిత్యవసరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అనే సత్యాలు మాట్లాడుతూ అకాల గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గోదావరి వరదలు తగ్గిన వెంటనే టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్ డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రతి గ్రామాన్ని సందర్శించి బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని ఇచ్చిన హామీ ప్రకారం పక్క గృహాలు నిర్మించి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, పార్టీ మండల కార్యదర్శి కనితిరాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేష్, ఎంపీటీసీలు మడకం రామారావు,తిరుపతి రావు, సర్పంచ్ జుంజుర్ లక్ష్మి, ప్రచార కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు, తోట రమేష్, పార్టీ నాయకులు శ్రీకాంత్, లంక శివ, జయసింహ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: