మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి ముంపుకు గురైన ఎం కాశీనగరం గ్రామానికి చెందిన కుటుంబాలను బిఎస్పి నాయకులు పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. మండల కన్వీనర్ సరియం బీమ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి తడికల శివకుమార్ 110 కుటుంబ బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల కారణంగా ఇక్కడున్న ప్రజలు తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన సమద్ పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి నారాయణ, వంశి సభ్యులు చుక్కా ముత్తయ్య రమేష్ వెంకటేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: