CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా వైఎస్ఆర్ జయంతి..

Share it:

 


జూలూరుపాడు జులై 8, (మన్యం మనుగడ) ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శుక్రవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ మండలాధ్యక్షులు మంగీలాల్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే నేటి వరకు ప్రజల్లో గుర్తుండి పోయాయని, రుణమాఫీ, ఉచిత వైద్యం, పొడు పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, కళ్యాణ లక్ష్మి, ఆపద్బంధు మొదలగు పథకాల ద్వారా ప్రజల్లో వైయస్ చిరస్మరణీయుడుగా గుర్తింపు పొందాడని, అతని జన్మదినం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మళ్ళీ ప్రజలు వైయస్సార్ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించేందుకు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, మండల ఎస్టీ సెల్ నాయకులు వాంకుడొతు కిషన్ నాయక్, యూత్ ప్రెసిడెంట్ గుగులోతు శ్రీను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాదావత్ సామ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: