దమ్మపేట జులై 08 ( మన్యం మనుగడ ) :దమ్మపేట గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లిరమేష్ బాబు ఆధ్వర్యంలో దమ్మపేట గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలతో అలంకరించటం జెండా ఆవిష్కరించడం జరిగింది, అనంతరం కేక్ కట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమములో మండల నాయకులు పాకనాటి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వరావు, మహిళ అధ్యక్షులు,జానబీ, చెక్రాల శ్రీను, కామినేని రమేష్, రాగం వాసు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: