మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరద ముంపు వల్ల నష్టపోయిన బాధితులకు అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో బట్టలు వంట సామాగ్రి తదితర వస్తువులు పంపిణీ చేశారు మండల పరిధిలోని గంగులు డబుల్ బెడ్ రూమ్ కాలనీ వర్క్ షాపు సున్నం బట్టి ఎల్లన్ రావు పేట గ్రామాల 500 కుటుంబాల బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి వరదలు ముంపునకు గురైన బాధితులు ఆధైర్య పడద్దని ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ, ఖమ్మం గ్రంధాలయ చైర్మన్ డింగిదల రాజేందర్, భద్రాచల నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకటరావు, పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు, కార్యదర్శి రాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రమేష్, లక్ష్మణ్, కామేష్, రామారావు, శ్రీకాంత్, జయసింహ, శివ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: