మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :
సీఎంఆర్ఎఫ్ (సీఎం రిలీఫ్ ఫండ్) పథకం పేదలకు కొండంత ధైర్యాన్నిస్తుందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. మంగళవారం మండల కేంద్రములో ఇటీవల పలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు పొంది సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రిలో పేదవాడు చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు పడేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పై ప్రత్యేక చొరవ చూపడంతో ప్రతి పేదవాడు నిర్భయంగా కార్పొరేట్ వైద్యం చేయించుకోగలుగుతున్నారని అన్నారు. ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, మండల నాయకులు కుదుమూరు జనార్దన్ రావు సూరా వెంకటేశ్వర్లు,మద్దిరాల చినపిచ్చయ్య, గుగులోత్ రమేష్, గుగులోతు శ్రీనివాస్ నాయక్, వంకాయలపాటి బాబురావు, కావూరి రమేష్, మంద అనీల్, జంపుల రాంబాబు, బానోత్ బాల్య, మూడు రవి, లబ్ధిదారులు నల్లగట్ల రమణ, సిహెచ్ కార్తీక్, కుంజ సీత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: