మన్యం మనుగడ, మంగపేట.
రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెంబర్ 29 ద్వారా విఆర్ఓ వ్యవస్థను రద్దు పరచి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పష్టమైన విధులు బాధ్యతలు ఇవ్వక పోవడంతో ఏ హోదా ఇవ్వక పోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నామని వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ సోమవారం మంగపేట తహశీల్దార్ వెంపెళ్లి శ్రీనివాస్ కు మండలంలోని వీ ఆర్ఓ లు మెమోరాండం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ స్పష్టమైన విధులు బాధ్యతలు జాబ్ చార్ట్ అప్పగించాలని విఆర్ఓ లను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాల ని నిలుపుదల చేసిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కారుణ్య నియామకాలు వెంటనే అమలు చేయాలని వివిధ రకాల సమస్యలతో కూడిన సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఓలు పాల్గొన్నారు.
Post A Comment: