- టీఆరెస్ పార్టీ పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు వెన్నా అశోక్ కుమార్
మన్యం మనుగడ ,అశ్వాపురం:
పినపాక నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటూ పినపాక నియోజకవర్గన్నీ అభివృద్ధి పధంలో నడిపిస్తున్న, అటువంటి వ్యక్తి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని, అటువంటి వ్యక్తి పై అనుచిత వ్యాఖ్యలు చేయటం,అవగహన లేని వార్తలు రాయటం సరికాదని కొంతమంది మీడియా మిత్రులను కోరుకుంటున్నాం అని టీఆరెస్ పార్టీ పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు వెన్నా అశోక్ కుమార్ తెలిపారు. ఎవరు ఎన్ని కుంతత్రాలు చేసిన,దొంగ రాతలు రాసిన, మా నాయకులు ఎవరు బాధ పడేది లేదని ముక్తకంఠంతో చెపుతున్నాను అని,ఎవరు దందాలు చేస్తున్నారో,ఎవరు గొడవలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు.తప్పుడు వార్తలను ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు అని,చివరకి చెప్పవచ్చేది ఏంటి అంటే పినపాక నియోజకవర్గంలో విప్ రేగా కాంతారావు గెలుపు నల్లేరు మీద నడక వంటిది అని ధీమా వ్యక్తం చేశారు. నిరాదరమైన వార్తలు రాయటం కొంత మంది పత్రిక మిత్రులు మనుకుంటే మంచిది అని ఆయన మనివి చేశారు.
Post A Comment: