మన్యం మనుగడ కరకగూడెం : మండల పరిధిలోని బట్టుపల్లి వీరపూరం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పడిగాపురం గ్రామానికి చెందిన కొమరం సతీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించి గ్రామస్తులు వెంటనే ఆటోలో కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. పడిగాపురం గ్రామానికి చెందిన కొమరం. సతీష్, తన స్నేహితులతో కరకగూడెం వచ్చి తిరిగి స్వగ్రామం పడిగపూరం వెళుతున్న క్రమంలో భట్టుపల్లి వీరపూరం క్రాస్ రోడ్డు కి సమీపంలోని ఆగి ఉన్న టాటా ఏసీ వాహనం ని బలంగా ఢీకొట్టడంతో టాటా ఏసీ వాహనంపై ఉన్న రేకులు తగలడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రధమ చికిత్స అనంతరం 108 వాహనంలో మణుగూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Post A Comment: