CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ముంపు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో గోదావరి వరదలతో ముంపునకు గురవడంతో నష్టపోయిన వరద బాధిత కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద సుమారు 200 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు రెండు నెలలపాటు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ముంపు ప్రాంత ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.ముంపుకు గురై ఇల్లులు కోల్పోయిన వారికి కాలనీలు నిర్మించి ఇస్తామని స్థానిక ప్రజలకు వారు తెలియజేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: