దమ్మపేట జులై 23 ( మన్యం మనుగడ ) : దుమ్ముగూడెం మండలం సున్నం బట్టి చింతకుప్ప ఆర్ కొత్తగూడెం మారుమూల అటవీ ప్రాంతమైన ఇప్పటికీ రవాణా మార్గం లేక అమాయక గిరిజనలు ఆరోగ్య సిబ్బంది వారం రోజులుగా తినటానికి తిండి లేక అనేక రకమైన ఇబ్బందులు పడుతూ గతంలో మనకున్న సంబంధాలను బట్టి వారు పట్వారిగూడెం పిహెచ్సి పరిధిలో ఉన్న సిబ్బందికి ఫోన్లు ద్వారా వారి గోడు వినిపించారు తక్షణమే చలించి పట్వారి గూడెం మెడికల్ సిబ్బంది ఆశ వర్కర్స్ లక్ష్మీ మేడం సహాయ సహకారాలతో వారికి 15 రోజులుగా సరిపడా బియ్యం నిత్యవసర సరుకులు 300 బ్యాగులుగా తయారు చేసుకుని ఈరోజు ఆ ప్రాంతాల్లో సిబ్బందికి మరియు గ్రామస్తులకు ఇవ్వడం జరిగినది వెళ్లిన వారిలో శారద సుజాత శ్యామల మిగిలిన సిబ్బందితో కలిసి నాటు పడవల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న 48 అడుగుల గోదావరి లో ప్రయాణించి అమాయక ఆశా వర్కర్లకు గిరిజనులకు ఇవ్వడం జరిగినది.వారికి దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు కొయ్యల అచ్యుత్ రావు బొల్లికొండ ప్రభాకర్ రేఖల సతీష్ కుమార్ డాక్టర్ నీలిమ,హెచ్ వి రత్తమ్మ హాస్పిటల్ సిబ్బంది సహకరించారు.
Post A Comment: