CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రకృతి ప్రకోనికి మానవాళి విలవిల.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూలై 13:


చత్తీస్గడ్, తెలంగాణ, రాష్ట్రాలలో ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సమ్మక్క సారలమ్మ బ్యారేజీ వద్దకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ములుగు జిల్లాలో పలు మండలాలు గోదావరి వరద తాకిడికి గురవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతాలలో జలదిగ్బంధంలో ఎన్నో గ్రామాలు విలవిలలాడుతున్నాయి.వాజేడు మండలంలో పలు గ్రామాలలో అత్యవసర పరిస్థితి తప్ప బయటికి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు.


 స్పెషల్ ఆఫీసర్, సర్దార్ సింగ్, తహసిల్దార్ గూడూరి లక్ష్మణ్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. టేకులగూడెం గ్రామంతో అంతరాష్ట్ర సంబంధాలైన చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు తాళ్ల గూడెం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి.

పక్కనే ఉన్న కృష్ణాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆ గ్రామంలో గర్భిణీ స్త్రీల పరిస్థితి తెలుసుకొని ముందస్తుగా మండల కేంద్రంకి తరలించారు.

   పెద్ద గొల్లగూడెం గ్రామంలో పొడెం, నాగరాజ్ ఇల్లు పూర్తిగా నీట మునిగింది. ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని స్థానిక సర్పంచ్ జేజ్జరి మేనక, ప్రజలకు తెలియజేశారు.


  కోయ వీరాపురం, గ్రామంలో ఐదు రోజులుగా విద్యుత్ సరపరలేక అంధకారంలో ఆదివాసులు బతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామంలో వరద నీరు ప్రవేశించింది. వాజేడు గ్రామంలో

 రహదారులు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిల్లా అధికారి ఆదేశాల మేరకు సిబ్బంది అప్రమత్తమై నీట మునిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు అత్యవసర పరిస్థితులలో వెళ్లేందుకు ప్రత్యేకంగా నామలు(బోట్లు) సౌకర్యం కూడా అందుబాటులో ఉంచామని ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సర్వర్ పాషా, ఎం ఆర్ ఐ కీసరి రాజు, వీఆర్ఏ, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: