మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ స్పష్టం చేశారు. మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రమిశెట్టి నిరంజన్ శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... విద్యలోనే భవిష్యత్తును తీర్చిదిద్దుకోచ్చన్నారు. ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కళ్లెం వెంకటేశ్వర్లు, గుగులోతు రమేష్, అంచ అప్పారావు, దాదుమియా, నజీర్, అంచ కృష్ణ, ధరావత్ అర్జున, అంచ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: