మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం కేంద్రం లో వీ ఆర్ ఏ లు అందరూ తమకు పెంచిన శాలరీ లు, ప్రమోషన్ లు ఇవ్వాలని ఈ సందర్బంగా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు.
,ఈ సందర్బంగా మంగపేట వీ ఆర్ ఏ ల అధ్యక్షులు పాగా బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విఆర్ఏజేఏసీ నిర్ణయం మేరకు మంగపేట మండలంలో 25_07_2022 నుండి పూర్తిస్థాయి నిరవధిక సమ్మెకు వెళుతున్నాము .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి హామీని నెరవేర్చదాక మేము సమ్మె చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ నిరవధిక సమ్మెలో వీ ఆర్ ఏ ల మంగపేట మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మక్క, రాము, సమ్మయ్య , రాజేశ్వరి, పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , నర్సింహా మూర్తి, మాధవి, ఖాజా హుస్సేన్ , పాల్గొనడం జరిగినది.
Post A Comment: