రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏ,ల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నుండి నిర్వాదిక సమ్మె నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు రాజయ్య ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్ ని ప్రభుత్వం స్వీకరించాలని నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏల జేఏసీ మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2020 వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు విఆర్ఏల కు, పే స్కేలు ఇస్తామని. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని, 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగం కల్పిస్తారని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేనా హామీలు అమలుకు నోచుకోక, హామీలుగా మిగిలిపోయిన పరిస్థితి అర్థం అవుతుంది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలకృష్ణ, మహిళా ఉపాధ్యక్షుడు అనూష ,ఉదయ ,తిరుపతమ్మ ,నాగరాజు బాలచంద్రమూర్తి ,రాంబాబు నన్నేమియ. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: