CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద ముప్పు బాధితులు ధర్నా.

Share it:

 


  • ఏటూరునాగారం గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ఈవోకు వినతి పత్రం అందజేత.
  • మండల కేంద్రంలోని నేతకాని వాడ,నందమూరి నగర్, హరిజన వాడ,కాలనీలకు గోదావరి వరద ఉప్పొంగిన నీరు వచ్చి నేటికీ 15 రోజులు కావస్తున్న, ఇల్లులన్ని నేటికీ జలదిగ్బంధంలో ఉన్నాయి.

మన్యం మనుగడ ఏటూరు నాగారం      

ఏటూరునాగారం మండల కేంద్రంలోని నేతకానివాడ,

నందమూరి నగర్,హరిజన

వాడ,గోదావరి ముంపుకు గురై తగ్గిపోయి నప్పటికి నేటికి కూడా ముంపు జలాలు

100 పైగా ఇళ్లలో,ఇండ్ల చుట్టూ నీరు చేరి దుర్గంధ భరితంగా ఉండడంతో పాటుగా సీజనల్ వ్యాధులు, జ్వరలు,దగ్గు జలుబు మలేరియా వ్యాధుల బారిన పడడంతో పాటు పాములు, తేళ్లు,కప్పలు,ఎలుకలు కూడా ప్రజల ఇండ్లలో చేరి తిరుగు తున్నాయని అన్నారు.

నిలువ ఉన్న నీటిని కాలువల ద్వారా లేకపోతే మోటార్ల ద్వారా బయటకు పంపించాలని అధికారులను కోరారు.విష జ్వరాలు ప్రభలుతున్న దృష్ట్యా ప్రజల సమస్యపై స్పందించి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా పాటుగా అధికారులను వెంట పెట్టుకొని మరీ నేతకాని వార్డులో ఉన్న ప్రజల కష్టాలను,

పరిశీలించారు.ఈ సమస్యపై తక్షణమే చర్యలను చేపట్టాలని

,రెవెన్యూ శాఖ ద్వారా త్వరితగతిన సర్వే నిర్వహించి బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన,పదివేల రూపాయలను అందించాలని, ఇండ్లల్లోకి నీళ్లు చేరిన వారికి, పదివేల రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం 5 కేజీల పప్పును ఇల్లు కూలిపోయిన వారికి 25 వేల రూపాయలు వెంటనే తక్షణ సహాయము అందించాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఇవ్వలేదని,సీఎం ప్రకటించిన పదివేల పాటుగా,రెవెన్యూ శాఖ ద్వారా ఆర్థికసాయం త్వరగా అందించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,మాజీ మండల అధ్యక్షులు వావిలాల నర్సింగరావు,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన ఎల్లయ్య,మండల ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కర్నె సత్యం,టౌన్ అధ్యక్షుడు ఎండి సులేమాన్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి రాము,సీనియర్ నాయకులు సోదారి రామయ్య, సాధనపల్లి లక్ష్మయ్య, తూర్పాటి కుమారస్వామి,టౌన్ యూత్ అధ్యక్షుడు బండారు లక్కి,వార్డ్ సభ్యుడు పడిదల హనుమంత్,సునారికాని శ్రీను,చింతకింది రాజు,  

కొండ గొర్ల పోశాలు,దొంగిలి మధు,నెగరికంటి ముత్తెష్,

కళ్యాణ్,శివ,సతీష్,విష్ణు,రాజు,మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: