దమ్మపేట జులై 28 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం లో వీఆర్ఏలు, నిరవధిక సమ్మెలో టిపిసిసి సభ్యురాలు ములకలపల్లి మండల జెడ్ పి టి సి, సున్నం నాగమణి పాల్గొని మాట్లాడుతూ వీఆర్ఏల డిమాండ్ లు అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, వారికి వేతనాలు పెంచాలని, వీఆర్ఏ ల పే స్కేలు అమలు చేయాలి, అర్హత కలిగినటువంటి వీఆర్ఏలకు పదోన్నతి ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండలం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మద్దిశెట్టి సత్యప్రసాద్, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు , కూకల కుంట్ల నాగబాబుగా, చెన్నంశెట్టి చిట్టిబాబు , కందుల వెంకటేశ్వరరావు, చిలకా శ్రీను, ఎస్కే షుకూర్, దమ్మపేట మండల ఓబిసి అధ్యక్షుడు వెలివెల శ్రీనివాసరావు. చీకటి శ్రీనివాసరావు, చీకటి కన్నయ్య. కుంట రాజశేఖర్, తనగల తిరుపతి రావు వాడే వీరస్వామి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని వీఆర్ఏలకు సంఘీభావం తెలియజేసినారు.
Post A Comment: