గుండాల జూలై 28(మన్యం మనుగడ) భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ గుండాల మండలంలో గురువారం పర్యటించారు. మండలం పరిధిలోని ముత్తాపురం గ్రామంలో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్, ఎస్టి బాయ్స్ హాస్టల్, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. మార్గమధ్యలోని మామ కన్ను ఏకలవ్య మోడల్ స్కూల్, కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలను సైతం ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో హజరత్ వలి, ఎంపీటీసీ సంధాని, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: