గుండాల జూలై 28(మన్యం మనుగడ) గత ఐదు రోజులుగా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వీఆర్ఏలకు ఎన్ ఎస్ యు ఐ మద్దతుగా నిలిచింది. గురువారం వారు ధర్నా చేస్తున్న శిబిరంలో కూర్చుని మద్దతు పలికారు ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ నాయకులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వీరి సమస్యలు నయమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ , రమేష్, హరి, నితిన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: