మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని పద్మపూరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు రిటైర్డ్ తహశీల్దారు కెవి మురళి కృష్ణమాచార్యులు భార్య క్రీ,,శే,,శేషుకుమారి జ్ఞాపకర్థంతో 42 మంది విద్యార్థులకు సూమరు 15 వేల రూపాయలు విలువచేసే బ్యాగ్స్,పలకలు,నోట్ పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్స్,వారికి ఉపయోగపడే వస్తువులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ తాటి.సరోజినీ ముఖ్య అథితిగా పాల్గొని వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.రాజ,ఎస్ఎంసీ చైర్మన్ మాధవి,ఉపాద్యాయులు శకుంతల, గ్రామస్తులు సమ్మయ్య,నరసింహరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: