మన్యం మనుగడ/వాజేడు:
మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రెగ్యు మీటింగ్ అనంతరం
జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి, పనులను సమర్ధవంతంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆదేశించారు. మండలంలోని వాజేడు నాగారం బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని ఆయన పరిశీలించి మొక్కలు నాటారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొత్తం 30వేల మొక్కలు నాటాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు నిత్యం పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని విజయ, ఎంపీఓ శ్రీకాంత్, కార్యదర్శి అశోక్, శ్రీకాంత్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: