మన్యం మనుగడ కరకగూడెం:
కరకగూడెం-చిరుమళ్ల గ్రామాల మధ్యన గల నిర్మించిన బ్రిడ్జి ఇటీవల కాలంలో కురిచిన బారి వర్షలకు బ్రిడ్జి ఒక్క పక్కకు కోతకు గురైంది.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక తహశీల్దారు ఉషా శారద తొ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బ్రిడ్జి పనులకు కావలసిన మరమ్మతులను వెంటనె చేపడతామని
అయన తెలిపారు.
బ్రిడ్జి ప్రక్కన రైతులు పండించే పంటలను నష్టపోకుండా,రైతులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనువాస్,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,మండల అద్యక్షులు రావుల.సోమయ్య గౌడ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం.రాంబాబు, ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: