CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ )ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.వామపక్ష విద్యార్థి సంఘాలు

Share it:

 



మన్యం మనుగడ, మంగపేట.

రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు జూనియర్ కళాశాల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా బుధవారం మంగపేట కేంద్రంలో అన్ని పాఠశాలలు కళాశాలలను బంద్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ మంగపేట మండల అధ్యక్ష కార్యదర్శి వి,సిద్దు , షఫీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో ప్రారంభమై దాదాపు 40 రోజులు కావస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలు అందించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా 28000 పాఠశాలలో ఉన్న పరిశుద్ధ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న వసతిని ఏర్పాటు చేయాలని, మన ఊరు మనబడి ప్రణాళికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను చేర్చి సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

 అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం 2020ని వెనక్కి తీసుకోవాలని, విద్యా కాషాయీకరణ, కార్పొరేటికరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని వారు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని అన్నారు.

అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బాకీలను వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు అన్నారు లేని యెడల ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో మంగపేట మండల నాయకుల మేరజ్ ఖాన్ , సాగర్, ఉగెందర్,పవన్, సాత్విక్, ఈశ్వర్, నాగార్జున,ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: