మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల తనిఖీ చేసిన ఏ టి డబ్ల్యూ ఓ అధికారి నరసింహారావు తనిఖీలో భాగంగా తో గూడెం రాజగుంకు లింగాపురం ఆదర్శనగర్ జినెలగూడం పాఠశాలలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని అలానే పిల్లలకు పోషకాహారం ఏర్పాటు, క్రీడలను ఆడించడం, పాఠశాల ఆవరణలో పచ్చని వాతావరణం లో చెట్లు పెంచాలని తెలిపారు ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ తెలుగు బేసిక్స్ తెలిసే విధంగా నేర్పించాలని ఉపాధ్యాయులకు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఎస్ సి ఆర్ పి వెంకట్, పాఠశాల హెచ్ఎంలు బి రవి, నరేందర్, గాంధీ, చరణ్, బద్రు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: