మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్ నందు గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా నిత్యవసర సరుకులను ఎంపీ బండి పార్థసారథి రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ముంపు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.గోదావరి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ రోడ్డు మార్గాన వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి గోదావరి వరద బాధితులను పరామర్శించారు అని అన్నారు.1000 కోట్లతో ఎత్తయిన ప్రదేశంలో కాలనీలు నిర్మించి, ఇస్తారని చెప్పడం అభినందనీయమని అన్నారు, ముంపుకు గురైన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబానికి రెండు నెలల పాటు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర , శ్రీమతి మాలోత్ కవిత , ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య , పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి , వైరా శాసనసభ్యులు లావుడ్యా రాముల నాయక్ , డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య , ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు , జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ , కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాపు సీతామహాలక్ష్మి , టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: