గుండాల జూలై 30(మన్యం మనుగడ) గత వారం రోజులుగా వీఆర్ఏలు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి బి ఎస్ పి నాయకులు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు హామీ ఇచ్చిన ప్రకారం వారి కోరికలన్నీ అమలుపరచాలని వారు కోరారు. శనివారం నిరసన కార్యక్రమంలో పాల్గొని నాయకులు బొమ్మెర్ల రాంబాబు మాట్లాడుతూ వీఆర్ఏలకు హామీలు ఇచ్చి ఏండ్లు గడుస్తున్న ప్రభుత్వం మాత్రం వారి హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొప్పుల జీవన్, వీఆర్ఏలు గుర్రం శివాజీ, సారయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: