CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరుపేద కుటుంబాలకు శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చేయూత.

Share it:


మన్యం మనుగడ,మంగపేట. 

మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబానికి చెందిన యెదల్ల సురేందర్ మణుగూరు మండలం లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతని తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడం, అన్నయ్య మానసిక వికలాంగుడు కావడంతో కుటుంబ భారాన్ని అంతా తనే మోస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఇతని కుడికాలు విరగడంతో ఆ కుటుంబం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో మరియు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ వారిని పరామర్శించి ,మనోధైర్యాన్ని కల్పించి వైద్య ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తదనంతరం పాలాయిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ బియ్యని సుశీల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది, ఆమె కుటుంబ సభ్యులను శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ పరామర్శించారు దశదిన కర్మల నిమిత్తం 25 కేజీల బియ్యం మరియు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుశీల మృతి చెందడంతో ఒంటరివాడు అయినా ఆమె మనవడు కార్తీక్ ను చదువు పరంగా సహాయ సహకారాలు అందిస్తామని మరియు శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, కొమరం నితిన్, ఇందారపు రమేష్, బాడిశ ఆదినారాయణ, కనుకుంట్ల నాగరాజు, రామ్మోహన్, బ్రాహ్మణపల్లి గ్రామస్తులు బాడిశ నరేష్, నాగుల వెంకటేశ్వర్లు,చిట్టిబాబు,కొమరం నరసింహారావు, బాడిశ రమణయ్య, చిడం నవీన్, ఇర్ప బాబు

పాలాయగూడెం గ్రామస్తులు కరకపల్లి నరసింహారావు, నిట్ట రవి, పిట్ట సుందర్ రావు, చిక్కుళ్ళ రాజు, జయరాజు, బియ్యాని శ్రీను, సాధన పల్లి వీరయ్య, తెల్ల సురేష్, గంగెర్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: