CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొనసాగుతున్న వీఆర్ఏల నిర వధిక సమ్మె.సంఘీభావం తెలిపిన పిఆర్టియు ఉపాధ్యాయ సంఘాలు.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు శనివారం వీఆర్ఏల ఆరవ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏల జెఎసి మండల అధ్యక్షులు జబ్బ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో సిబ్బందికి గులాబి పూలు ఇచ్చి తమకు మద్దతు తెలిపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి గంపల శంకర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో గ్రామ రెవెన్యూ సహాయకులు అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 9వ తేదీన 2020 సంవత్సరంలో అసెంబ్లీ సమావేశంలో ప్రకటించిన హామీల మేరకు పేస్కేలు వెంటనే అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతిని కల్పించాలని,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల స్థానాలలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక సమ్మె కొనసాగిస్తామని వీఆర్ఏల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వీఆర్ఏల సమ్మె చేస్తున్న నిరవధిక సమ్మె కు పిఆర్టియు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతూ.పిఆర్టియు ములుగు జిల్లా అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విఆర్ఏల పే స్కేలు చదువుకున్న వీఆర్ఏలకు ప్రమోషన్లు 50 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఆర్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు చెరుకుల ధర్మయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పిఆర్టియు రాష్ట్ర కమిటీ కార్యదర్శి కొయ్యడ మల్లయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు.వీఆర్ఏలకు మద్దతు తెలిపిన పిఆర్టియు నాయకులు సోలం సత్యం, అంజయ్య,మడప సమ్మయ్య, ఈ కార్యక్రమంలో జాడి వెంకటేశ్వర్లు,మాటూరి సురేష్, ఆకు విజయ,వైదేయ,సరళ దేవి,ఈసం లక్ష్మి,గోగు విజయలక్ష్మి,బొల్లి రాము, కుమ్మరి వెంకటయ్య,కాళ్ల రాము,బత్తుల కృష్ణ,బందెల నరసయ్య,గద్దల కృష్ణ,కంచ లక్ష్మయ్య,మాదరి దేవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: