మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో నాలుగైదు రోజులు గా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మల్లెల మడుగు గ్రామం నుంచి నెల్లిపాక గ్రామపంచాయతీ వరకు సుమారు 3 కిలోమీటర్ల పడవలో ప్రయాణించి అక్కడికి వెళ్లి వరద ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వరద ముంపు బాధితులకు కావలసిన పునరావాస కేంద్రాలు మండల కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు రానున్న మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిస్తున్న తరుణంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నెలకొంటున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అధికార యంత్రంగా అందుబాటులో ఉండాలని సూచించారు, వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు, గ్రామంలోని వరదల వల్ల కలిగే ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు, ఇప్పటికి వాగులు పొంగుతున్న పరిస్థితులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: