మన్యం మనుగడ, అశ్వారావుపేట:పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పరిశుభ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి అన్నారు. పట్టణంలోని పేరాయిగూడెం గ్రామపంచాయతీ లో చెత్త తరలింపు కోసం నూతనంగా కొనుగోలు చేసిన రెండు ట్రాలీ ఆటోలను సర్పంచ్ సుమతి శనివారం పూజలు చేయించి ప్రారంభించారు. పాలకవర్గం తీర్మానం చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి లో భాగంగా స్వచ్ఛ ట్రాలీలను తడి చెత్త మరియు పొడి చెత్త సేకరణ కొరకు డోర్ టు డోర్ కలెక్షన్ కొరకు ట్రాలీ ఆటోలను రెండు కొనుగోలు చేయడం జరిగింది అని, చెత్త తరలింపుకోసం ఈ వాహనాలను ఉపయోగిస్తామని వివరించారు. ఇందులో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి కంటైనర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మూర్తి, గుమస్తా రమణ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: