మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం, రమణక్కపేట గ్రామానికి చెందిన పూస లక్ష్మి కి చెందిన గుడిసె కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున కూలిపోయింది. నిద్రిస్తున్న పూస లక్ష్మి కూలిన ఇల్లు లోపల నుండి కేకలు వేయడం తో గ్రామస్తులు వచ్చి ఆమెను బయటకు తీశారు.పూస లక్ష్మి స్వల్ప గాయాలతో బయట పడింది ఎటువంటి ప్రాణ నష్టం, గాని ఆస్తి నష్టం కానీ జరగలేదు. పూస లక్ష్మి భర్త చనిపోయి ఒంటరి మహిళగా జీవిస్తున్నారు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఇప్పుడు ఉన్న గుడిసె కూడా కూలిపోవడం తో ఏమిచేయాలో తెలియని పరిస్థితి, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక చేయూతను అందించాలని ఈ సందర్బంగా కోరారు.
Post A Comment: