మన్యంమనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పాలకమండలి సమీక్షా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి అశ్వారావుపేట మండలం రామన్న గూడెం గ్రామంలో గిరిజనుల భూసమస్యలు జాయింట్ సర్వే చేసి వారి పట్టా భూములు వారికి అందజేయాలని కోరుకుంటూ రామన్నగూడెం భూ సమస్య కోర్టు జడ్జిమెంటు కాపీలు కూడా ఇవ్వటం జరిగిందనీ జడ్పీటీసీ సున్నం నాగమణి తెలిపారు. రామన్న గూడెం గ్రామం గిరిజనులు భూ సమస్య పరిస్కారం కోసం గ్రామస్తులంతా నిరాహార దీక్ష చేస్తారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో, జిల్లా కలెక్టర్ రామన్న గూడెం వచ్చి గిరిజనుల భూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందనీ ఆమె తెలిపారు.
Navigation
Post A Comment: