గుండాల జూలై 11(మన్యం మనుగడ) ఉదృతంగా ప్రవహించే ప్రవహించే వాగులలో దాటే సాహసం చేయవద్దని ఇల్లందు డిఎస్పి రమణమూర్తి మండల ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన ఉదృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగును ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరిని ఉదృతంగా ప్రవహించే వాగులోకి దిగకుండా వారికి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. వర్షాలు తగ్గినంతవరకు పోలీస్ శాఖ తరపున అనునిత్యం ప్రజలకు సూచనలు చేయాలని ఆయన స్థానిక అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హజరత్ వలి,సిఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, ముత్తాపురం సర్పంచ్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: