మన్యం మనగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతి రావు పేట గోదావరి పరివాహక ప్రాంతం భారీ వర్షాల తో ముంపు కి గురైన కారణంగా, జానంపేట లోని ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు. ఆ ప్రదేశాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సందర్శించి, పునరావాసం కోసం వచ్చిన వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: