గుండాల/ఆళ్లపల్లి జూలై 11(మన్యం మనుగడ) గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో భారీగా నష్టం వాటిల్లింది. వర్షాల దాటికి పంట చేనులతో పాటు, ఇండ్లు సైతం భారీగా దెబ్బతిన్నాయి. సోమవారం తాసిల్దార్ సాదియా సుల్తానా మండలంలోని కిన్నెరసాని, జల్లేరు వాగులను ఆమె సందర్శించారు. రాయపాడు వద్ద కిన్నెరసాని బ్రిడ్జిపై పెద్ద ఎత్తున నిలిచిన చెత్తను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారులు చేశారు. అనంతరం తాసిల్దార్ సాదియా సుల్తానా మాట్లాడుతూ ప్రజలు ఎవరు వర్షాలలో బయట తిరగవద్దని వాగులను దాటే సాహసం చేయవద్దని ప్రజలకు ఆమె సూచించారు.
Post A Comment: